ఎస్ఐ ఓవరాక్షన్..రైతుపై విచక్షణారహితంగా దాడి..రంగంలోకి హెచ్చార్సీ
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ఎస్ఐ శ్రీహరి ఓవరాక్షన్ చేశాడు. వ్యవసాయ పనులకు వెళుతున్న రైతు, ఆయన కొడుకుపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు. పొలంలోకి వెళుతున్న రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లాఠీ విరిగేలా విచక్షణ రహితంగా కొట్టాడు. ఎస్సై దాడిలో రైతు రాజేందర్, అతని కొడుకు హరీష్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మానవ హక్కుల సంఘం..ఏసీపీ ర్యాంక్ అధికారిని ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి..నివేదిక […]
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ఎస్ఐ శ్రీహరి ఓవరాక్షన్ చేశాడు. వ్యవసాయ పనులకు వెళుతున్న రైతు, ఆయన కొడుకుపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు. పొలంలోకి వెళుతున్న రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లాఠీ విరిగేలా విచక్షణ రహితంగా కొట్టాడు. ఎస్సై దాడిలో రైతు రాజేందర్, అతని కొడుకు హరీష్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితులు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న మానవ హక్కుల సంఘం..ఏసీపీ ర్యాంక్ అధికారిని ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి..నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
కాగా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని బాధితుని కుటుంబం డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ పనులు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిని లెక్క చెయ్యకుండా పోలీసులు ఈ తరహా దాడులకు పాల్పడటం భావ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఫ్రంట్ లైన్ లో ఉండి చేస్తోన్న కష్టాన్ని, త్యాగాన్నీ అస్సలు తక్కువ చెయ్యలేం. కానీ జీవితాంతం అదే కష్టం చేస్తూ మన కడుపు నింపుతోన్న రైతు మీదకి లాఠీ ఎత్తే ముందు ఒకటికి, రెండు సార్లు ఆలోచిస్తే బెటర్.