బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 37మంది మృతి, 15 మందికి తీవ్ర గాయాలు
బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావో పాలోలో దారుణ యాక్సిడెంట్ జరిగింది . బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37 మంది మృత్యువాతపడగా.. మరో 15 మంది తీవ్ర గాయాలయ్యాయి.
బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావో పాలోలో దారుణ యాక్సిడెంట్ జరిగింది . బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 37 మంది మృత్యువాతపడగా.. మరో 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ టెక్స్టైల్ సంస్థ ఎంప్లాయిస్ ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో యాక్సిడెంట్ జరిగింది. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి డెడ్బాడీలను బయటకు తీసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలకు సంతాపంగా టగ్వా సిటీలో మూడు రోజుల సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేశిస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో బస్సులో 53 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి ట్రక్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read : తీరం దాటిన ‘నివర్’, ప్రచండ గాలుల బీభత్సం, భారీగా ఆస్తినష్టం !