అస్సాంలో రూ.5 కోట్ల హెరాయిన్, బ్రౌన్ షుగర్ పట్టివేత
అస్సాంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్, బ్రౌన్ షుగర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అస్సాంలో శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్, బ్రౌన్ షుగర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ నహీద్ కరిష్మా నేతృత్వంలోని బృందం మణిపూర్ నుంచి గౌహతికి వెళ్లే ట్రక్కును దిమాపూర్-మంజా రోడ్లోని చెక్ పోస్ట్ వద్ద అడ్డుకుని సోదాలు జరిపారు. 75 ప్యాకెట్లలో యబా ట్యాబ్లెట్లు, 68 ప్యాకెట్లలో హెరాయిన్, బ్రౌన్ షుగర్ ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదైందని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసులు అధికారి తెలిపారు.
అలాగే బార్పేట జిల్లాలో బైక్పై వెళ్తున్న ఇద్దరు డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి వద్ద10 చిన్న కంటైనర్లలో ప్యాక్ చేసిన 20.55 గ్రాముల బ్రౌన్ షుగరు పొట్లాలు లభించాయి.
Also Read :