ఇవాళ ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల భేటీ.. బస్సుల బస్సు పునరుద్ధరణపై చర్చ
తెలుగు రాష్ట్రాల మధ్య అపరిషృతంగా ఉన్న సమస్యలతో పాటు అంతర్రాష్ట్ర బస్సులు పునరుద్ధరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఇవాళ సమావేశం కానున్నారు.
తెలుగు రాష్ట్రాల మధ్య అపరిషృతంగా ఉన్న సమస్యలతో పాటు అంతర్రాష్ట్ర బస్సులు పునద్ధరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు ఇవాళ సమావేశం కానున్నారు. గత నెలలో హైదరాబాద్ బస్భవన్లో రెండురాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు జరిగాయి. రెండురాష్ట్రాలు సమాన దూరం నడుపుకుందామన్న ప్రతిపాదనకు ఏపీ అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో మరోసారి చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన వెయ్యి బస్సులు దాదాపు 2.65 లక్షల కిలోమీటర్ల వరకు నడుస్తుంటే.. ఏపీ పరిధిలో టీఎస్ఆర్టీసీకి చెందిన 750 బస్సులు 1.45 లక్షల కిలోమీటర్ల దూరం మాత్రమే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము నడుపుతున్న 2.65 కిలోమీటర్లలో 50 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని.. తెలంగాణ 50వేల కిలోమీటర్ల మేర పెంచుకుంటే రెండు రాష్ట్రాలు సమానంగా నడిపినట్టు అవుతుందని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు అంగీకరించని తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రస్తుతం ఉన్న మేరకే తాము నడుపుతామని తేల్చి చెప్పారు. ఇక సరిహద్దు పన్నును ఎవరి రాష్ట్రంలో వారు చెల్లించుకుంటే సరిపోతుందని పేర్కొన్నట్టు సమాచారం.
అయితే, రెండు రాష్ట్రాల అధికారుల అంగీకరించకపోవడంతో సర్వీసుల నిర్వహణపై ప్రతిష్టంభన నెలకొంది. మరోవైపు రెండు రాష్ట్రాలకు చెందిన రవాణా మంత్రుల గత ఆదివారం సమావేశమవుతారని భావించారు. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి భేటీ జరుగలేదు. కాగా, ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల ఓ కొలిక్కిరావడంతో ఈ ఇవాళ్టి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. మార్చిలో విధించిన లాక్డౌన్ అనంతరం రెండురాష్ట్రాల మధ్య సర్వీసులు నిలిచిపోయాయి. ఆధికారుల మధ్య చర్చలు సఫలమై సర్వీసులు ప్రారంభం అవుతాయని ఇరు రాష్ట్రాల ప్రయాణికులు ఆశిస్తున్నారు.