శవాల దగ్గర పేలాలు ఏరుకునే వ్యక్తి చంద్రబాబు: కొడాలి నాని

కోడెల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. ఆయన అనేక రకాలుగా సేవలు అందించారని.. ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు నాని. ఈ సందర్భంగా.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. కోడెలపై ఎవరూ కేసులు పెట్టలేదని.. అసెంబ్లీ ఫర్నీచర్ తీసుకున్నానని ఆయనే స్వయానా ఒప్పుకున్నారని తెలిపారు. కోడెల శివప్రసాద్ పల్నాటిపులి అయితే చంద్రబాబు నక్క అని.. నక్క పల్నాటి […]

శవాల దగ్గర పేలాలు ఏరుకునే వ్యక్తి చంద్రబాబు: కొడాలి నాని
Follow us

| Edited By:

Updated on: Sep 17, 2019 | 1:26 PM

కోడెల మృతిపై సంతాపం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి కొడాలి నాని. ఆయన అనేక రకాలుగా సేవలు అందించారని.. ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలి.. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు నాని. ఈ సందర్భంగా.. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

కోడెలపై ఎవరూ కేసులు పెట్టలేదని.. అసెంబ్లీ ఫర్నీచర్ తీసుకున్నానని ఆయనే స్వయానా ఒప్పుకున్నారని తెలిపారు. కోడెల శివప్రసాద్ పల్నాటిపులి అయితే చంద్రబాబు నక్క అని.. నక్క పల్నాటి పులిని మోసం చేసిందని విమర్శించారు. ఇప్పుడు అదే చంద్రబాబు కోడెల మృతిపై మొసలి కన్నీరు కార్చుతున్నారన్నారు. గతంలో ఎన్టీఆర్ మరణానికి కారణo చంద్రబాబు కాదా..? ఎన్టీఆర్ అంత్యక్రియల్లో.. చంద్రబాబుపై ఆయన వ్యతిరేకులు చెప్పులు వేసింది నిజం కాదా..! శవాలు దగ్గర పేలాలు ఎరుకునే వ్యక్తి చంద్రబాబు.. అని ఆరోపించారు.

కోడెల కేసులు ఎదుర్కొనేటప్పుడు ఒక్కసారి కూడా బాబు స్పందించ లేదు. కోడెల ఆత్మహత్యకు చంద్రబాబు ప్రేరేపించారని.. ఈ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా పెట్టాలని పేర్కొన్నారు. కేసీఆర్ ఈ కేసుపై దృష్టి పెట్టి విచారణ చెయ్యాలి. కోడెల ఫోన్ కాల్ డేటాను పరిశీలించాలి. చంద్రబాబుతో మాట్లాడటానికి కోడెల ఎలాంటి ప్రయత్నం చేశారో అప్పుడు తేలుతుందని అన్నారు కొడాలి నాని.