జగన్ సర్కార్ కీలక నిర్ణయం : రైతుల కోసం జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ
ఏపీ సీఎం జగన్ తన మార్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన పదే, పదే ప్రస్తావిస్తున్నారు.
Andhra Farmers News : ఏపీ సీఎం జగన్ తన మార్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన పదే, పదే ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మేలు చేకూర్చే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. పరిశ్రమలు, వాణిజ్య శాఖ, వ్యవసాయం, సహకార శాఖల సమన్వయంతో జాయింట్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు, గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్ ఇతర అంశాలపై రైతులకు టాస్క్ ఫోర్స్ కమిటీ సేవలందించనుంది.
వ్యవసాయ, పరిశ్రమల శాఖలతో పాటు ఇతర 11 శాఖల ఉన్నతాధికారులు ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఆహార శుద్ధి, నైపుణ్యం, విలువ జోడింపు… తదితర అంశాలపై నిర్ణయాల ఈ కమిటీ రైతులతో చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.
Also Read : తెలంగాణ : రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్లు విడుదల