మహిళల కోసం మరో సంక్షేమ పధకం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!

పేదింటి అక్కల కోసం 'వైఎస్ఆర్ చేయూత' పధకాన్ని అమలు చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవాళ జరగబోయే ఏపీ మంత్రివర్గ భేటిలో దీనికి ఆమోదం...

మహిళల కోసం మరో సంక్షేమ పధకం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం.!
Follow us

|

Updated on: Jun 11, 2020 | 10:02 AM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేదింటి అక్కల కోసం ‘వైఎస్ఆర్ చేయూత’ పధకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇవాళ జరగబోయే ఏపీ మంత్రివర్గ భేటిలో దీనికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ పధకం ద్వారా 45-60 ఏళ్ల వయసు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు గాను రూ. 75 వేల ఆర్ధిక సాయాన్ని ఉచితంగా అందజేయనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24.19 లక్షల మంది మహిళలు ఈ పధకం ద్వారా లబ్ది పొందనుండగా.. దీని అమలుకు ఏపీ ప్రభుత్వం ఒక్కో ఏడాదికి రూ.4,535.70 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.18,142.8 కోట్లను ఖర్చు చేయనుంది. కాగా, అధికారిక వర్గాల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45-60 ఏళ్లు కలిగిన మహిళలు ఎస్సీలలో 5.89 లక్షల మంది, ఎస్టీలలో 1.63 లక్షల మంది, బీసీల్లో 15.26 లక్షల మంది, మైనార్టీ లలో 1.40 లక్షల మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.