Covid Aid : ఏపీలో కొవిడ్ మృతులపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అంత్యక్రియల సాయంపై ఏపీ సర్కారు తాజా ఉత్తర్వులు

AP Government Aid : కొవిడ్ మృతుల అంత్యక్రియలపై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు..

Covid Aid : ఏపీలో కొవిడ్ మృతులపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అంత్యక్రియల సాయంపై ఏపీ సర్కారు తాజా ఉత్తర్వులు
Humanity
Follow us

|

Updated on: May 16, 2021 | 9:24 PM

AP Government Aid : కొవిడ్ మృతుల అంత్యక్రియలపై ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల అంత్యక్రియలకు సంబంధించి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. 2021-22 ఏడాదికి గాను కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు చొప్పున ఆర్థికసాయం అందించాలని అధికారిక ఉత్తర్వులిచ్చారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని సదరు ఉత్తర్వుల్లో వివరించారు.

Read also : Cyclone Tauktae : తూర్పుమధ్య అరేబియా సముద్రం మీదున్న అతి తీవ్ర తుఫాను తౌక్టే.. 18వ తేదీ ఉదయం తీరాన్ని దాటే అవకాశం