మోదీ బాటలో జగన్… కృష్ణా నదీ తీరాన వైఎస్ భారీ విగ్రహం!

నర్మదా నది మధ్యలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టును పటేల్ జయంతి రోజునే ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం కావడం గమనార్హం. ఇప్పుడు ఏపీలో కూడా స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో విగ్రహ ఏర్పాటుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. గుంటూరు జిల్లా […]

మోదీ బాటలో జగన్... కృష్ణా నదీ తీరాన వైఎస్ భారీ విగ్రహం!
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2019 | 4:51 AM

నర్మదా నది మధ్యలో ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. స్టాట్యూ ఆఫ్ యూనిటీగా నామకరణం చేసిన ఈ ప్రాజెక్టును పటేల్ జయంతి రోజునే ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 182 మీటర్ల ఎత్తయిన ఈ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే అతి ఎత్తయిన విగ్రహం కావడం గమనార్హం. ఇప్పుడు ఏపీలో కూడా స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో విగ్రహ ఏర్పాటుకు జగన్ సర్కార్ నిర్ణయించింది.

గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయనుంది. దాని కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పటేల్ విగ్రహమంత భారీ స్థాయిలో కాకపోయినా అదే తరహాలో విగ్రహ నిర్మాణం, వైఎస్సార్ స్మృతివనం, ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్కును కూడా ఏర్పాటు చేయనుంది. పులిచింతల ప్రాజెక్టు సమీపంలో సుమారు 45 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

పులిచింతల ప్రాజెక్టు వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు. విగ్రహ నిర్మాణానికి అనువైన స్థలం కోసం పరిశీలన చేశారు. వైఎస్సార్‌ స్మృతి వనం, పార్కు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టును ఓ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌ విగ్రహంతో పాటు డా.కేఎల్‌ రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పులిచింతల ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్టు మంత్రి అనిల్ వెల్లడించారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య ప్రయాణ ఇబ్బందులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల, గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామాల మధ్య కృష్ణా నదిపై వారధి నిర్మాణానికి ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!