ఏపీ : హోం ఐసోలేషన్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం…
కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ..హాస్పిటల్స్ లో చేరకుండా ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఏపీ సర్కార్ ఖరారు చేసింది.
కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ..హాస్పిటల్స్ లో చేరకుండా ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఏపీ సర్కార్ ఖరారు చేసింది. ఈ మేరకు హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా .. వెంటనే టోల్ఫ్రీ(0866-2410978)నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితా కూడా టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి మెడికల్ హెల్ప్ పొందవచ్చని తెలిపారు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు ఆహారంలో బ్రౌన్రైస్, గోధుమలు, చిరుధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.