షూటింగ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..
రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్..
AP Government: రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ స్థలాలు, ప్రాంగణాల్లో షూటింగ్లు నిర్వహించుకునేందుకు అనుమతిస్తామని ఆయన అన్నారు.
కరోనా వైరస్ నేపధ్యంలో రాష్ట్రంలో సినిమా షూటింగ్లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగష్టు 21న జారీ చేసిన మార్గదర్శకాలు, ఎస్ఓపీలతో రాష్ట్రంలో తిరిగి సినిమా షూటింగ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. వీటిని చిత్రీకరణ సమయంలో యూనిట్ అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
- టెక్నీషియన్లు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
- నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు
- షూటింగ్ సమయంలో ఉపయోగించే పరికరాలు, యూనిట్లు, సెట్లతో సహా అన్నింటిని తరచూ శానిటైజ్ చేయాలి.
- టెక్నీషియన్లు, నటీనటులు హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించాలి
- చిత్రీకరణ సమయంలో కొన్ని పరిస్థితులు మినహాయించి.. మిగిలిన అన్ని సమయాల్లోనూ ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి.
- కరోనా నియంత్రణకు సంబంధించిన ప్రకటనలను సినిమా ప్రారంభంలోనూ, ఇంటర్వెల్లోనూ ప్రదర్శించాలి.
కాగా, సినిమా షూటింగులకు సంబంధించిన వివరాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ www.apsftvtdc.inలో పొందవచ్చునని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Also Read:
ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..