చంద్రబాబుకు డీఐజీ పాలరాజు కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలపై ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన మూడు పేజీల లేఖకు డీఐజీ పాలరాజు కౌంటరిచ్చారు. చంద్రబాబు రాసిన లేఖ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన అన్నారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో (ఎన్సీఆర్బీ)లో పొరపాట్లను అందరూ గుర్తించారని చెప్పారు. అయితే, చంద్రబాబు మాత్రమే గుర్తించలేదని పాలరాజు చెప్పారు. చంద్రబాబు విజ్ఞతతో ఆలోచించాలని.. రాష్ట్రంలో పోలీసులు ఎంతో అప్రమత్తంగా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు […]

చంద్రబాబుకు డీఐజీ పాలరాజు కౌంటర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 06, 2020 | 5:00 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల సమస్యలపై ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు రాసిన మూడు పేజీల లేఖకు డీఐజీ పాలరాజు కౌంటరిచ్చారు. చంద్రబాబు రాసిన లేఖ పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆయన అన్నారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో (ఎన్సీఆర్బీ)లో పొరపాట్లను అందరూ గుర్తించారని చెప్పారు. అయితే, చంద్రబాబు మాత్రమే గుర్తించలేదని పాలరాజు చెప్పారు. చంద్రబాబు విజ్ఞతతో ఆలోచించాలని.. రాష్ట్రంలో పోలీసులు ఎంతో అప్రమత్తంగా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తించాలని సూచించారు. టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ కారుపై దాడి చేసిన దుండగులను పట్టుకుంటామని.. పట్టాభి ఇంట్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో కేసు విచారణలో జాప్యం నెలకొందని పాలరాజు వెల్లడించారు.