అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీపై సీఎం జగన్ సమీక్ష!
కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఎపి సీఎం జగన్ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనా రాయణ, సీఎస్ నీలం సాహ్ని, ఏఎంఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం ఇతర అధికారులు పాల్గొన్నారు. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులు, వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించారు.
చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కార్యాచరణ పూర్తి చేయాలని, నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం తెలిపారు. మిగిలిన పనుల పూర్తికి సుమారు రూ.14 వేల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఒక అంచనా.
Read More: