ఇటువంటి మండలి మనకు అవసరమా? : సీఎం జగన్
ఏపీలో శాసన మండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. సోమవారం దీనిపై అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకుంటామని సభలో ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. కీలక బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడం, చైర్మన్ తీరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. అసలు మండలిలో ఏం జరిగిందన్న దానిపై మంత్రులు సుదీర్ఘంగా ప్రసంగించారు. చైర్మన్ తీరును తప్పుబడుతూనే మండలిని కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై చర్చ జరగాల్సిందేని స్పష్టం చేశారు మంత్రులు. మరోవైపు […]
ఏపీలో శాసన మండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. సోమవారం దీనిపై అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకుంటామని సభలో ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. కీలక బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడం, చైర్మన్ తీరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. అసలు మండలిలో ఏం జరిగిందన్న దానిపై మంత్రులు సుదీర్ఘంగా ప్రసంగించారు. చైర్మన్ తీరును తప్పుబడుతూనే మండలిని కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై చర్చ జరగాల్సిందేని స్పష్టం చేశారు మంత్రులు. మరోవైపు మండలిలో చైర్మన్ చేసిన 11 నిమిషాల ప్రసంగాన్ని అసెంబ్లీలో వేసి వినిపించారు ముఖ్యమంత్రి. అది అయ్యాక… ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన మండలి ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటోందని తీవ్రంగా స్పందించారు జగన్.
సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
- బుదవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలు నా మనసును బాధించాయి
- ఇది ప్రజల సభ, ప్రజలు ఆమోదించిన సభ, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పడ్డ సభ
- మండలి చట్టసభలో భాగం కనుక చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం
- ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు
- శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిష్పక్షపాతంగా సభను నిర్వహించే పరిస్థితి లేదని చెప్పారు
- శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు..లేదంటే..సవరణలు కోరుతూ తిప్పి పంపొచ్చు
- కానీ విచక్షణా అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్.. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు..ఇది సమర్ధనీయమా..?
- ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం చేసిన బిల్లుల్ని.. ఓడిపోయిన పార్టీ అడ్డుకోవడం చట్టవిరుద్ధం
- రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించింన మండలిని.. కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని ప్రజలందరూ ఆలోచించాలి
- ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ లు ఉంటాయి
- దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం 6 చోట్ల మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయి
- మండలి నిర్వాహణకు ప్రతి ఏడాది రూ. 60 కోట్లు ఖర్చవుతోంది
- అసెంబ్లీలోనే అన్ని రంగాల మేధావులు, నిపుణులు ఉన్నారు
- మండలిని రద్దు చేసే అంశంపై అసెంబ్లలో సోమవారం సుదీర్ఘంగా చర్చించి, ఒక నిర్ణయం తీసుకుందాం