ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ శుభవార్త..
ఏపీలోని ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత ఫైల్పై సంతకం చేశారు.
Teachers Transfers In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధిత ఫైల్పై సంతకం చేశారు. ఈ మేరకు రెండు లేదా మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి చివరికి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులంతా బదిలీలకు అర్హులని.. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా, మూడేళ్ళుగా ఎదురు చూస్తున్న బదిలీల అంశంపై జగన్ కీలక నిర్ణయం తీసుకోవడంపై టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..
ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..