అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన..
విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంప్ అఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం శంకుస్థాపన
AP CM lays foundation stone: విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి క్యాంప్ అఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ విగ్రహంతో పాటు, అంబేద్కర్ స్మారక భవనం, గ్రంథాలయం, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. 20 ఎకరాల విస్థీర్ణంలో ఏడాదిలోపు ఈ నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి రాష్ట్ర నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉన్న భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు బదలాయించినట్లు అధికారులు తెలిపారు.
[svt-event date=”09/07/2020,1:39AM” class=”svt-cd-green” ]
AndhraPradeshCM: విజయవాడ స్వరాజ్ మైదానంలో(డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదానం) 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్ధాపన చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్. pic.twitter.com/Kv13e8cTuz #iprap
— I & PR Andhra Pradesh (@IPR_AP) July 8, 2020
[/svt-event]