ఇక్కడేం గాడిదలు కాశారు..?: చంద్రబాబు పై జగన్ ఫైర్

ఏపీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. బడ్జెట్ తొలిరోజు కావడంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. సీఎం జగన్ బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు లేవనెత్తారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్దం సభను వేడెక్కించింది. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు చేసిందేమి లేదని జగన్ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని అన్నారు. మరి ఆ సమయంలో చంద్రబాబు ఇక్కడేం […]

ఇక్కడేం గాడిదలు కాశారు..?: చంద్రబాబు పై జగన్ ఫైర్
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 1:02 PM

ఏపీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. బడ్జెట్ తొలిరోజు కావడంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. సీఎం జగన్ బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు లేవనెత్తారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్దం సభను వేడెక్కించింది. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు చేసిందేమి లేదని జగన్ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని అన్నారు. మరి ఆ సమయంలో చంద్రబాబు ఇక్కడేం గాడిదలు కాశారని విమర్శలు చేశారు. అసలు చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తయిందా అని జగన్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలన్నారు. రెండు రాష్ట్రాల సీఎంలు కలిసి పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు. దీనికి చంద్రబాబు అధికారం ఉంది కదా అని విర్రవీగొద్దంటూ కౌంటర్ ఇచ్చారు.