మళ్లీ తెరపైకి ‘రాజధాని’ రచ్చ.. ఘాటుగా చంద్రబాబు వ్యాఖ్యలు..!!
ఏపీ రాజధానిపై మళ్లీ చర్చలేపారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతినే రాజధానికి సరైనదని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ర్టం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ కూడా స్వాగతించారన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అమరావతినే అనుకూల ప్రాంతంగా ధృవీకరించిందన్నారు. అలాగే.. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన నాలుగేళ్ల తరువాత మళ్లీ రాజధాని నిర్ణయంపై కమిటీ వేయడం ఏంటి..? హైకోర్టు వద్ద తాగడానికి టీ […]
ఏపీ రాజధానిపై మళ్లీ చర్చలేపారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతినే రాజధానికి సరైనదని చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ర్టం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించామన్నారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ కూడా స్వాగతించారన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అమరావతినే అనుకూల ప్రాంతంగా ధృవీకరించిందన్నారు.
అలాగే.. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన నాలుగేళ్ల తరువాత మళ్లీ రాజధాని నిర్ణయంపై కమిటీ వేయడం ఏంటి..? హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితి అనే వ్యాఖ్యలు మీకు తలవంపులుగా లేవా..? అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మించే సత్తా లేదు. ఆ విషయాన్ని ప్రజల ముందు ఒప్పుకునే నిజాయితీ లేదు. అందుకే.. రాజధానిపై.. అటూ ఇటూ.. చర్చలు లేపుతున్నారని ఘాటుగా ట్వీట్ చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.
ప్రధాని శంకుస్థాపన చేసిన 4ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్ణయంపై కమిటీ వేయడం ఏమిటి?‘‘హైకోర్టు వద్ద తాగడానికి టీ కూడా లేని పరిస్థితి’’ అనే వ్యాఖ్యలు మీకు తలవంపులుగా లేవా?వైసీపీ ప్రభుత్వానికి రాజధాని నిర్మించే సత్తా లేదు. ఆ విషయాన్ని ప్రజల ముందు ఒప్పుకునే నిజాయితీ లేదు. (2/2)
— N Chandrababu Naidu (@ncbn) October 24, 2019
రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉండాలని అమరావతిని రాజధానిగా నిర్ణయించాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోజు స్వాగతించారు. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో, కమిటీకి వచ్చిన మెయిల్స్ కూడా అమరావతినే అనుకూల ప్రాంతంగా ధ్రువీకరించాయి. (1/2)
— N Chandrababu Naidu (@ncbn) October 24, 2019