ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై నిన్న బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కరోనా బారినపడ్డారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై నిన్న బీజేపీ తలపెట్టిన కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో తనతో కాంటాక్ట్ అయినవారు టెస్టులు చేయించుకోవవాలని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు.
ఇక ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. గురువారం రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం కొత్తగా 7,855 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,385కు చేరింది. మరో 52 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,558కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 69353 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.
Also Read :