తంగేడుపల్లి మేజర్ కాల్వలో కారు బోల్తా.. నలుగురు జలసమాధి
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామర్రు వెళ్తున్న కారు.. శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లాలోని రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం మధ్య అదుపుతప్పి తంగేడుపల్లి మేజర్ కాల్వలోకి దూసెకెళ్లింది. దీంతో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు. మృతదేహాలను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరించామన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.