తంగేడుప‌ల్లి మేజ‌ర్‌ కాల్వ‌లో కారు బోల్తా.. నలుగురు జలసమాధి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్ర‌మాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

తంగేడుప‌ల్లి మేజ‌ర్‌ కాల్వ‌లో కారు బోల్తా.. నలుగురు జలసమాధి
Follow us

|

Updated on: Oct 16, 2020 | 7:23 AM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్ర‌మాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. హైద‌రాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామ‌ర్రు వెళ్తున్న కారు.. శుక్రవారం తెల్ల‌వారుజామున గుంటూరు జిల్లాలోని రొంపిచ‌ర్ల‌-సుబ్బ‌య్యపాలెం మ‌ధ్య అదుపుతప్పి తంగేడుప‌ల్లి మేజ‌ర్‌ కాల్వ‌లోకి దూసెకెళ్లింది. దీంతో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవ‌డంతో అందులో ప్ర‌యాణిస్తున్న‌ నలుగురు మర‌ణించార‌ని పోలీసులు తెలిపారు. మృత‌దేహాల‌ను న‌ర‌స‌రావుపేట ప్ర‌భుత్వ ఆస్పత్రికి త‌రించామ‌న్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే, మృతులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.