టీడీపీ నేత రాయపాటికి షాక్..ఆస్తుల వేలానికి రంగం సిద్దం…
టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామివేత్త రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఆస్తులను వేలం వేయబోతున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గురువారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రూ.837.37 కోట్ల విలువైన అప్పులు చెల్లించకపోవడంతో.. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తెలిపింది.
టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామివేత్త రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తుల వేలానికి రంగం సిద్దమైంది. ఆయన ఆస్తులను వేలం వేయబోతున్నట్టు ఆంధ్రాబ్యాంక్ గురువారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రూ.837.37 కోట్ల విలువైన అప్పులు చెల్లించకపోవడంతో.. గుంటూరు, న్యూఢిల్లీలోని ఆయనకు ఆస్తులను మార్చి 23వ తేదీన వేలం వేస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ తెలిపింది. గుంటూరు అరండల్పేటలో గల 22,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కమర్షియల్ బిల్డింగ్తో పాటు, న్యూఢిల్లీలోని ఫ్లాట్ను వేలం వేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఉన్న అప్పులకు.. వేలం వేసే ఆస్తులకు మధ్య అస్సలు పొంతన లేనట్టు సమాచారం. గుంటూరు ప్రోపర్టీ విలువను రూ.16.44 కోట్లు గాను, ఢిల్లీలోని ఫ్లాట్ను రూ.1.09 కోట్లుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. రాయపాటి ఆంధ్రా బ్యాంకు నుంచి ట్రాన్స్ట్రాయ్ ఇండియా కంపెనీ పేరుతో పాటు, మల్లినేని సాంబశివరావు, రాయపాటి రంగారావు, చెరుకూరి శ్రీధర్, దేవికారాణి, లక్ష్మి పేరిట రుణాలు తీసుకున్నారు.
ఈ రుణానికి పూచీకత్తుగా నారయ్యచౌదరి, రంగారావు, దేవికారాణి, రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, లక్ష్మి, జగన్మోహన్ యలమంచలి, సీహెచ్ వాణి ఉన్నారు. ఈ వేలాానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆంధ్రా బ్యాంక్ వెబ్సైట్ లేదా టెండర్స్ డాట్ జీవోవీ డాట్ ఇన్ను సంప్రదించాల్సిందిగా బ్యాంకు ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి :నేడు అమరావతి బంద్..