Amitabh Bachchan: పామును చంపి..బెత్తం దెబ్బలు తిన్న బాలీవుడ్ మెగాస్టార్..చిన్ననాటి జ్ఞాపకాల్లోకి బిగ్ బీ
కౌన్ బనేగా కరోడ్ పతి 12వ సీజన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. కరోనా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తల నడుమ షోను నిర్వహిస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ ఈ షోలోనూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
కౌన్ బనేగా కరోడ్ పతి 12వ సీజన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. కరోనా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తల నడుమ షోను నిర్వహిస్తున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ ఈ షోలోనూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పట్ల ఆయన ఆప్యాయతను ప్రదర్శిస్తారు. ఆ షోను ఒక కార్యక్రమంలా కాక.. మధ్య మధ్యలో కంటెస్టెంట్లకు చెందిన జీవిత విశేషాలను ఆయన అడిగి తెలుసుకుంటూ.. దానిని రియల్ షోలా మార్చారు.
తాజాగా ఎపిసోడ్లో అమితాబ్ బచ్చన్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో స్నేహితులతో కలసి ఓ పామును చంపి తాను ఎలా బెత్తం దెబ్బలు తిన్నరో వివరించారు. ఒక రోజు స్కూలు వద్ద మిత్రులతో కలిసి పామును చంపానని వెల్లడించారు. తాము పిల్లలం కావడంతో పామును చంపడం అనేది తమకు చాలా పెద్ద విషయమని అన్నారు. అయితే, ఆ పామును ఓ హాకీ స్టిక్కు తగిలించి స్కూలు గ్రౌండ్ లో ఊరేగింపుగా తిరిగామని తెలిపారు. అయితే పామును తాము మైదానంలో ప్రదర్శించిన విషయం ప్రిన్సిపాల్కు తెలిసిందని, ఆయన ఎంతో స్ట్రిక్ట్ అని వెల్లడించారు. ఆయన గట్టిగా నిలదీసే సరికి నిజం చెప్పాల్సి వచ్చిందన్నారు.
పామును తామే చంపామని తెలుసుకున్న ప్రిన్సిపాల్ బెత్తం దెబ్బలు శిక్షగా విధించాడని అమితాబ్ గుర్తు చేసుకున్నారు. చొక్కాలు విప్పించి, అందరి వీపులు మోతమోగేలా కొట్టారని తెలిపారు. ఇప్పుడా ఘటన తల్చుకుంటే నవ్వొస్తుంది కానీ, అప్పుడు చాలా బాధపడ్డట్లు అమితాబ్ వివరించారు.
Also Read :
House sites distribution : ఇళ్ల పట్టాలు చేతికందిన ఆనందం.. లబ్దిదారులు సీఎంపై ఇలా చూపించారు అభిమానం
Madduvalasa Fishes : మడ్డువలస చేపలు..క్యూ కడుతున్న జనాలు..ఒక్కసారి టేస్ట్ చేస్తే వదలరు !
Tirumala News : కలశం గుర్తును శిలువగా తప్పుడు ప్రచారం..టీటీడీ సీరియస్..పోలీసులకు ఫిర్యాదు..