ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌.. హాజరైన కేంద్ర హోం మంత్రి

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 70 వ ఐపీఎస్‌ బ్యాచ్‌లో మొత్తం 92 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాగా, ఈ బ్యాచ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు. ఈ కార్యక్రమానికి […]

ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌.. హాజరైన కేంద్ర హోం మంత్రి
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 10:43 AM

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 70 వ ఐపీఎస్‌ బ్యాచ్‌లో మొత్తం 92 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. కాగా, ఈ బ్యాచ్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు ముగ్గురు చొప్పున ఐపీఎస్‌లను కేటాయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తదితరులు హాజరయ్యారు.