జేఈఈ పరీక్షకు 75% స్టూడెంట్స్ హాజరు
జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో మొత్తం 4,58,521 మంది అభ్యర్థులకు గానూ 3,43,958 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్లో మొత్తం 4,58,521 మంది అభ్యర్థులకు గానూ 3,43,958 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“గత 3 రోజుల నుంచి జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్కు విద్యార్థులు హాజరవుతున్నారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలోనూ ఆత్మ నిర్భర్ భారత్ అనే యజ్ఞంలో పాలుపంచుకోవటం కోసం చాలా మంది స్టూడెంట్స్ పాల్గొనటం చాలా ఆనందం ఉంది.. విద్యార్థుల కెరీర్లపై ఎఫెక్ట్ పడకుండా వారికి సహకరించిన ముఖ్యమంత్రులందరికీ నా ధన్యవాదాలు ” అని రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ ఎగ్జామ్స్ను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు రోజూ రెండు స్లాట్లలో నిర్వహిస్తోంది. మొదటిది ఉదయం 9 నుంచి 12 గంటలకు, తర్వాత సాయంత్రం 3 నుంచి 6వరకు జరుపుతుంది. మొదటి రోజైన సెప్టెంబర్ 1 జరిగిన బీ ఆర్కిటెర్చర్, బీ ప్లానింగ్ పేపర్ ఎగ్జామ్ 54.67 శాతం మంది స్టూడెంట్స్ రాశారు. 2, 3న జరిగిన బీటెక్, బీఈ పేపర్లకు రికార్డు స్థాయిలో 81.08 శాతం, 82.14 శాతం మంది స్టూడెంట్స్ హాజరయ్యారు.
Also Read :
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం