బీజేపీలో చేరిందని ఇల్లు ఖాళీ చేయమన్నారు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఓ ముస్లిం మహిళ బీజేపీలో చేరిందని.. అద్దె ఇంటి యజమని ఇల్లు ఖాళీ చేయమన్న ఘటన చోటుచేసుకుంది. అలీఘడ్‌కు చెందిన గులిస్థానా అనే వివాహిత ఆదివారం బీజేపీ సభ్యత్వం స్వీకరించింది. ఈ విషయం తెలుసుకున్న అద్దె ఇంటి యజమాని తన పట్ల అమర్యాదగా మాట్లాడటమే కాకుండా తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గులిస్థానా బీజేపీలో చేరాక ఇంటి యజమాని తల్లి రూ.4వేలు […]

బీజేపీలో చేరిందని ఇల్లు ఖాళీ చేయమన్నారు..
Follow us

| Edited By:

Updated on: Jul 08, 2019 | 9:39 AM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో ఓ ముస్లిం మహిళ బీజేపీలో చేరిందని.. అద్దె ఇంటి యజమని ఇల్లు ఖాళీ చేయమన్న ఘటన చోటుచేసుకుంది. అలీఘడ్‌కు చెందిన గులిస్థానా అనే వివాహిత ఆదివారం బీజేపీ సభ్యత్వం స్వీకరించింది. ఈ విషయం తెలుసుకున్న అద్దె ఇంటి యజమాని తన పట్ల అమర్యాదగా మాట్లాడటమే కాకుండా తక్షణమే ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించాడు. దీంతో ఏం చేయాలో తెలియని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గులిస్థానా బీజేపీలో చేరాక ఇంటి యజమాని తల్లి రూ.4వేలు విద్యుత్ బిల్లు చెల్లించాలని కోరిందని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు పై ఆధారాలు లభించడంతో ఇంటియజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అలీఘడ్ ఎస్పీ ఆకాష్ కులహరి చెప్పారు.