మందుబాబులకు గుడ్ న్యూస్..అన్ని జోన్లలోనూ మద్యం అమ్మకాలు
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడో విడత లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి భారీస్థాయిలో మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. ఈ క్రమంలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్-19 కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ లిక్కర్ అమ్మకాలకు జరుపుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని నిబంధనలు విధించింది. మద్యం మాత్రమే అమ్మే […]
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడో విడత లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి భారీస్థాయిలో మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. ఈ క్రమంలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
కోవిడ్-19 కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోపాటు రెడ్ జోన్లలోనూ లిక్కర్ అమ్మకాలకు జరుపుకోవచ్చని తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని నిబంధనలు విధించింది. మద్యం మాత్రమే అమ్మే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో షాపు వద్ద కొనుగోలు దారులు ఆరడుగుల భౌతిక దూరం పాటించాలి. షాపు వద్ద అయిదుగురికి మించి ఉండకూడదు. షాపులో పనిచేస్తోన్న సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలి. రెడ్ జోన్లలోని మాల్స్లో ఉన్న వైన్ షాపులు, మార్కెట్ ఏరియాల్లో ఉన్నవాటికి ఈ వెసులుబాటు వర్తించదు.