Akshay Kumar: అక్షయ్ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. ఫోన్ ఛార్జింగ్ పెడదామని వెళితే..
Akshay Kumar Insta Post: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటారు...
Akshay Kumar Insta Post: బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన వివరాలనే కాకుండా ఇతర అంశాలను కూడా పంచుకోవడం అక్షయ్కి అలవాటు. ఈ క్రమంలోనే అక్షయ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా అక్షయ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి సాకెట్ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడ దృశ్యం చూసిన అక్షయ్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. వెంటనే మొబైల్ తీసి దాన్ని కెమెరాతో దాన్ని ఫొటోలో బంధించాడు. ఇంతకీ అక్కడ ఏముందనేగా.. అనుకోని అతిథిగా వచ్చిన ఓ కప్ప సాకెట్లో నక్కి ఉంది. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘నేను నా ఫోన్ చార్జింగ్ కోసం సాకెట్ దగ్గరకు వెళ్లి చూడగా నాకు మరొకటి కనిపించింది. కప్ప ఆ ప్రాంతాన్ని ఆక్రమించేసింది’ అంటూ ఫన్నీగా రాసుకొచ్చాడు.
View this post on Instagram
ఇక అక్షయ్ కుమార్ ఇటీవల రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ‘లక్ష్మి’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సౌత్లో సూపర్ హిట్ అయిన ‘కాంచనా’ సినిమాకు రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ ట్రాన్స్ జెండర్ పాత్రలో బాలీవుడ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో అభిమానులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడీ స్టారీ హీరో.
Also Read: Viral News : ఆ గ్రామంలో 80శాతం మంది జనవరి 1నే పుట్టారట..అసలు మిస్టరీ ఏంటంటే..?