అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక తొక్కి ఎలా ఆడించాలో.. ఎలా కూర్చోబెట్టాలో మాకు తెలుసు.. గ్రేటర్లో హీట్ పెంచిన చోటా భాయ్
ఒంటరిగానే తేల్చుకుంటాం అంటూ బడా భాయ్ క్లారిటీ ఇచ్చారు. కానీ చోటా భాయ్ అంత సుతిమెత్తగా చెప్పలేదు. సుత్తితో కొడుతూనే సూటిగా సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు.
MLA Akbaruddin Owaisi Slammed : నిన్న మొన్నటి వరకు కూల్గా ప్రచారం చేసుకుంటూ పోతున్న ఎంఐఎం ఒక్కసారిగా హీట్ పెంచింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సంచలన ప్రకటనలను చేస్తోంది. పాతబస్తీ మొత్తాన్ని షేక్ చేసి పారేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో ఓవైసీ బ్రదర్స్ ఓ స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నారు.
బడా భాయ్ బీజేపీని టార్గెట్ చేస్తుంటే.. చోటా భాయ్ గులాబీకి గురి పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమకు ఏ పార్టీతో పొత్తు లేదని మాత్రమే టీఆర్ఎస్ – ఎంఐఎం చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడా ఓ పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకోలేదు. కానీ బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలను టార్గెట్ చేసింది. అంతర్గతంగా పొత్తులు పెట్టుకుని పైకి నాటకాలాడుతున్నారని విమర్శించింది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్సైపోయింది. ఇటు గులాబీ అటు పతంగి టార్గెట్ చేస్తున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటున్నాయి.
టీఆర్ఎస్తో తమకు ఎలాంటి పొత్తులు లేవు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ఒంటరిగానే తేల్చుకుంటాం అంటూ బడా భాయ్ క్లారిటీ ఇచ్చారు. కానీ చోటా భాయ్ అంత సుతిమెత్తగా చెప్పలేదు. సుత్తితో కొడుతూనే సూటిగా సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక తొక్కి ఎలా ఆడించాలో.. ఎలా కూర్చోబెట్టాలో తమకు బాగా తెలుసన్నారు. మాకు ఎవరి కాళ్ల కింద బతికే అవసరం లేదని.. తాము అడుగేస్తే దుమ్ములేస్తుందంటూ పొలిటికల్ డైలాగ్లు పేల్చారు. ఈ కామెంట్స్తో ఇప్పుడు సీన్ టీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎంగా మారింది. ప్రభుత్వం పేద వారి ఇళ్లు కూలుస్తోందని.. ఇదేంటని ప్రశ్నిస్తే అక్రమంగా కట్టారని చెబుతున్నారని అన్నారు. అలాంటప్పుడు ఎన్టీరామారావు, పి.వి.నరసింహారావు సమాధులు కూడా తొలగించాలని అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.