లద్దాఖ్ బార్డర్స్ వద్దకు మరో 2వేల అదనపు బలగాలు..!
భారత్- చైనాల మధ్య సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఉగ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్లోని బార్డర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియా.
భారత్- చైనాల మధ్య సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఉగ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్లోని బార్డర్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది ఇండియా. ఇప్పటికే భారీగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను సరిహద్దుల వెంబడి మోహరించగా..మరో 2000 మంది ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను బార్డర్స్ కు పంపనున్నట్లు కేంద్రం హోంశాఖ అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఏవైనా అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వేచ్చగా వ్యవహరించడానికి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఉన్న కమాండర్లకు ఇండియన్ ఆర్మీ అనుమతి ఇచ్చింది. గాల్వన్ వ్యాలీ వద్ద చైనా దాష్టీకంతో 20 భారత సైనికులు చనిపోయిన నేపథ్యంలో భారత్ ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది.
లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ఏరియాల్లో ఐటీబీపీలోని 20 అదనపు కంపెనీలకు చెందిన బలగాలని మోహరించనున్నట్లు అధికారులు వివరించారు. ఇరు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల మేర ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ వెంబడి ఇప్పటికే.. గస్తీ కాస్తున్నాయి ఐటీబీపీ దళాలు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కారకోరమ్ పాస్ నుంచి జచెప్ లా వరకు 180 బార్డర్ పోస్టుల వద్ద ఐటీబీపీ దళాలు మోహరించారు.