గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన యాంకర్ ప్రదీప్..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మణికొండలోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటాడు నటుడు, యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ..
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మణికొండలోని తన నివాస ప్రాంగణంలో మొక్కలు నాటాడు నటుడు, యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుంది. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు ఆనందంగా ఉందని ప్రదీప్ అన్నాడు. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే అందరూ మొక్కలు నాటాలి అని అన్నారు. అనంతరం కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్, నటి ప్రియమణి, హీరో రామ్ పోతినేని ముగ్గురికి ఛాలెంజ్ విసిరాడు ప్రదీప్ మాచిరాజు. అలాగే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రతినిధి సుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.
Read More:
వీధి వ్యాపారులకు ఊరట.. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు పర్మిషన్..
ఏడో నిజాం కుమార్తె బషీరున్నిసా బేగం మృతి
రామ్ గోపాల్ వర్మకు షాక్.. రూ.4 వేల ఫైన్ విధించిన జీహెచ్ఎంసీ..