ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం..ఏ-3 గా ఉన్న ఉదయ్సింహను అరెస్టు చేసిన ఏసీబీ
మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఉదయ్సింహను అరెస్ట్ చేశారు. ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్సింహను..
మళ్లీ ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన ఉదయ్సింహను అరెస్ట్ చేశారు. ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్సింహను ఏసీబీ అధికారులు బుధవారం అరెస్టు చేశారు.
ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేశారు. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు.
ఏసీబీ కోర్టులో ఉదయ్సింహను గురువారం హాజరుపరచనున్నారు. కాగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.