తల్లితో అక్రమ సంబంధం… కూతురిపై అత్యాచారం
ఒంటరి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని..ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగు చూసింది.
ఒంటరి మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని..ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నీచుడు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు బాధిత బాలిక తల్లి ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇబ్రహీంపట్నం పటేల్ గూడకి చెందిన నర్సింహా యాదవ్ ని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం కాలనీలో ఉంటున్న ఒక మహిళ భర్తతో గొడవలు కారణంగా కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో సదరు మహిళతో పరిచయం పెంచుకున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ నర్సింహ యాదవ్ మాయమాటలతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ మహిళ కూతురిపై కూడా కన్నేశాడు ఆ ప్రబుద్దుడు. మైనర్ బాలికను లొంగదీసుకోవలని ప్రయత్నాలు చేసి విఫలమై.. చివరికి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపుతానంటూ బెదిరింపులకి పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా ఆ మైనర్ బాలిక ముభావంగా ఉండటం గమనించిన తల్లి… గట్టిగా అడగటంతో అసలు విషయం బయటకు చెప్పింది. దీంతో బాలిక తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పొక్సో చట్టం కింద కేస్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.