ఉగ్రదాడిలో 29 మంది సైనికులు మృతి..

మాలీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నార్తర్న్ మాలీలో గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని మాలీ ఆర్మీ తన అధికారిక ఫేస్ బుక్ పేజ్ లో వెల్లడించింది. గావో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లుగా అక్కడ అంతర్గతంగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయని.. ఈ ప్రాంతంలో ఉగ్రకదలికలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. కాగా.. ఈ ప్రాంతంలో గతంలో కూడా ఉగ్రవాదులు అనేకసార్లు ఆర్మీ […]

ఉగ్రదాడిలో 29 మంది సైనికులు మృతి..
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2020 | 7:00 PM

మాలీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నార్తర్న్ మాలీలో గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 29 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని మాలీ ఆర్మీ తన అధికారిక ఫేస్ బుక్ పేజ్ లో వెల్లడించింది. గావో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత నాలుగేళ్లుగా అక్కడ అంతర్గతంగా ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయని.. ఈ ప్రాంతంలో ఉగ్రకదలికలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. కాగా.. ఈ ప్రాంతంలో గతంలో కూడా ఉగ్రవాదులు అనేకసార్లు ఆర్మీ బేస్ క్యాంపులపై దాడికి పాల్పడ్డారు.