సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు
తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ జేసీ శ్రీనివాసులు ఉత్వర్వులు జారీ చేశారు.
ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో ఏపీలోని వాలంటీర్ వ్యవస్థ కోవిడ్ వ్యాప్తిని కంట్రోల్ చెయ్యడానికి బాగా ఉపయోగపడుతోంది. ఎప్పటికప్పుడు సమాచార సేకరణ, ప్రైమరీ కాంటాక్ట్లను కనుగొనడం, సింటమ్స్ ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయించడం, హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడం వంటి అంశాల్లో వాలంటీర్లు చొరవ తీసుకుంటున్నారు.
అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో విధుల్లో అలసత్వంగా వ్యవహరించినవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. తాజాగా శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు పడింది. వారిని విధుల నుంచి తొలగిస్తూ జేసీ శ్రీనివాసులు ఉత్వర్వులు జారీ చేశారు. కరోనా విధుల్లో అలసత్యంగా వ్యవహరించారన్న కారణంగా వారిపై వేటు వేశారు. సర్వేలియన్స్ మోనెటరింగ్ చేయలేదంటూ ఉపాధి హామీ ఏపీవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Also Read : విషాదం : కరోనాతో సీపీఐఎంఎల్ నేత జశ్వంతరావు మృతి