Breaking: ఘోర రైలు ప్రమాదం.. 19 మంది వలస కూలీలు మృతి..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇవాళ ఉదయం ఘోర రైలు ప్రమదం సంభవించింది. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలు ట్రాక్పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, […]
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇవాళ ఉదయం ఘోర రైలు ప్రమదం సంభవించింది. కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్పై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 19 మంది వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలు ట్రాక్పై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
కాగా, ఆ వలస కూలీలు మధ్యప్రదేశ్కు తిరిగి వెళ్తున్నారని కర్మాడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. వారు రైలు పట్టాల వెంట నడుస్తూ అలసట కారణంగా రైలు పట్టాలపై పడుకున్నారు. తెల్లవారుజామున 5.15 గంటలకు ఈ దుర్ఘటన జరిగిందని అధికారి వెల్లడించారు.
Read This: కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!
An accident happened near Karmad, Aurangabad when an empty rake of goods wagon ran over some people. RPF and local police are reaching spot to asses the situation. More details awaited: Chief Public Relations Officer (CPRO) of South Central Railway (SCR) #Maharashtra pic.twitter.com/uAqWn1HsQI
— ANI (@ANI) May 8, 2020