లాక్డౌన్లోనూ బంగారం భగభగలు..భారీగా పెరిగిన ధరలు..
బంగారం రేట్లు భగ్గముంటున్నాయి. పసిడి సామాన్యులకు అస్సలు అందనంటోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. నేడు కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా 5వ రోజు కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరగడం వల్ల మన మార్కెట్లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక బంగారం వెంటే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది. మంగళవారం హైదరాబాద్ […]
బంగారం రేట్లు భగ్గముంటున్నాయి. పసిడి సామాన్యులకు అస్సలు అందనంటోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. నేడు కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా 5వ రోజు కావడం గమనార్హం. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ధర పెరగడం వల్ల మన మార్కెట్లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక బంగారం వెంటే వెండి ధర కూడా పరుగులు పెడుతోంది.
మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర ఏకంగా రూ.400 పెరుగుదలతో రూ.44,500కు చేరింది. అదే క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.410 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,840కు చేరుకుంది. కేజీ వెండి ధర రూ.150 పెరగడం గమనార్హం. దీంతో ప్రస్తుతం వెండి ధర రూ.41,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ రావడం వల్లే వెండి ధర పెరిగిందని నిపుణులు చెప్తున్నారు.
ఇక రాజధాని నగరం ఢిల్లీ మార్కెట్లో కూడా బంగార రేటు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.550 పెరుగడంతో రూ.43,120కు ఎగసింది. అదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర కూడా రూ.150 పెరుగుదలతో రూ.45,120కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.150 పెరగడంతో.. ప్రస్తుతం రూ.41,300కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్, వడ్డీ రేట్లు, వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.