ఖమ్మంలో దారుణం.. వివాహితను అపహరించి సామూహిక అత్యాచారం!

Tribal Woman Raped in Khammam: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. రఘునాథపాలెం మండలంకు చెందిన ఓ వివాహితను ఏడుగురు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. హర్యాతండాకు చెందిన బాధితురాలు(35) శుక్రవారం రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి బైకుపై అదే గ్రామంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లారు. అక్కడ ముందుగానే […]

ఖమ్మంలో దారుణం.. వివాహితను అపహరించి సామూహిక అత్యాచారం!
Follow us

|

Updated on: Jan 26, 2020 | 10:55 AM

Tribal Woman Raped in Khammam: ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. రఘునాథపాలెం మండలంకు చెందిన ఓ వివాహితను ఏడుగురు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి జరగ్గా.. శనివారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. హర్యాతండాకు చెందిన బాధితురాలు(35) శుక్రవారం రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరించి బైకుపై అదే గ్రామంలోని పత్తి చేనులోకి తీసుకెళ్లారు. అక్కడ ముందుగానే ఉన్న ఐదుగురితో సహా మొత్తం ఏడుగురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాధితురాలిని కిడ్నాప్ చేస్తున్న సమయంలో గమనించిన పొరిగింటి మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి చేరుకునే లోపే నిందితులు పారిపోయారు.

తనపై బాణోతు మోహన్‌, బాణోతు ఉపేందర్‌, అంగోతు కల్యాణ్‌, బాణోతు చంటి, అజ్మీరా నాగేశ్వరరావు, మాలోతు అశోక్‌, బి. సునీల్‌ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా  పోలీసులకు సంఘటనాస్థలంలో మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితులను అరెస్ట్ చేయాలని గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగగా.. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. కాగా, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.