Crime News: బుల్లితెర నటి వేధింపులు.. కేసు నమోదు.!
తమిళ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటి నందిని మైనాపై పోలీస్ కేసు నమోదైంది. తన ఫోన్ నెంబర్ను ఆమె నకిలీ ఫేస్బుక్ ఖాతాకు జత చేసినట్లు సమత్తువ మక్కళ్కట్చి నాయకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Latest Crime News: తమిళ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన నటి నందిని మైనాపై పోలీస్ కేసు నమోదైంది. తన ఫోన్ నెంబర్ను ఆమె నకిలీ ఫేస్బుక్ ఖాతాకు జత చేసినట్లు సమత్తువ మక్కళ్కట్చి నాయకుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళ్తే..
Also Read: Polluted India:కాలుష్య భూతం కోరల్లో ఇండియా.. టాప్ ప్లేస్లో 21 నగరాలు..!
నందిని మైనా కొద్దిరోజుల కిందట ఓ నకిలీ ఫేస్బుక్ ఖాతాను ప్రారంభించింది. అందులో ఆమె నెంబర్కు బదులుగా ఈరోడ్ జిల్లా, అందియూర్ సమీపంలోని అన్నామడులై గ్రామానికి చెందిన గురునాథన్ అనే వ్యక్తి ఫోన్ నెంబర్ను నమోదు చేసింది. అతడు ఆ జిల్లా సమత్తువ మక్కళ్ కట్టి కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. కాగా, ఆ ఖాతాలో ఉన్న నెంబర్ నందినిదే అనుకుని ఎవరెవరో తెలియని వ్యక్తులు అర్ధరాత్రులు ఫోన్ చేసి గురునాథన్ను వేధించడం మొదలుపెట్టారు. దీనితో ఆయన అందియూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈరోడ్ జిల్లా సైబర్ క్రైం పోలీసులు ఈ కేసుపై విచారణ చేపట్టారు.
Also Read: జగనన్న విద్యాదీవెన కార్డుపై సూపర్ స్టార్ ఫోటో.. ఏంటా కథ.?