మలింగ వస్తున్నట్టా…రానట్టా…?
సందడిగా సాగే ఈ ఆటకు దేశ విదేశాల్లోని ఆటగాళ్లు దుబాయ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే మూడు జట్లు దుబాయ్ చేరుకోగా....
Lasith malinga Likely to Miss Personal Reasons : ఎప్పుడెప్పుడా అని ఎదిరిస్తున్న ఐపీఎల్ సందడి మరికొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఎంతో సందడిగా సాగే ఈ ఆటకు దేశ విదేశాల్లోని ఆటగాళ్లు దుబాయ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే మూడు జట్లు దుబాయ్ చేరుకోగా.. ఇప్పుడు చెన్నై జట్టు బయలు దేరిన విషయం తెలిసిందే. యూఏఈ వెళ్లిన ముంబై ఆటగాళ్లతో లసిత్ మలింగ వెళ్లలేదు.
వ్యక్తిగత కారణాల వల్ల మలింగ ఆలస్యంగా దుబాయ్ వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఈ పేసర్ కొలంబోలో తన శిక్షణను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నట్లు తెలిసింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్ వీల్లో మలింగ కీలక పాత్ర పోషించాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చివరి ఓవర్లో చివరి బంతికి ముంబైకి విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే జట్టు యాజమాన్యం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మలింగ్ ప్రయాణం ఎప్పుడు అనేది ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ను గందరగోళానికి గురి చేస్తోంది. ఇదిలావుంటే..సెప్టెంబర్ 19నుంచి యుఏఈలోని అబుదాబి, షార్జా, దుబాయ్లోని మూడు వేదికల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు.