‘జంబలకిడిపంబ’ హీరో రాజేంద్రప్రసాద్ – మంచు లక్ష్మీ
‘నాకు నా డైలాగ్లే గుర్తు ఉండవు.. మా నాన్నగారి డైలాగ్లా.. కెవ్వూ’ అనే కేకతో మొదలైన మంచు లక్ష్మీ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గత శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు హాజరైన మంచు లక్ష్మీ స్పీచ్పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచ్లు పేలుస్తున్నారు. . మంచు లక్ష్మీ మాట్లాడుతూ… ‘నా తరువాత మాట్లాడేవాళ్లు చాలా మంది […]
‘నాకు నా డైలాగ్లే గుర్తు ఉండవు.. మా నాన్నగారి డైలాగ్లా.. కెవ్వూ’ అనే కేకతో మొదలైన మంచు లక్ష్మీ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గత శనివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్కు హాజరైన మంచు లక్ష్మీ స్పీచ్పై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచ్లు పేలుస్తున్నారు. .
మంచు లక్ష్మీ మాట్లాడుతూ… ‘నా తరువాత మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఇంగ్లీష్లో మాట్లాడితేనే తొందరగా మాట్లాడగలను. తెలుగు అంటే రోజంతా పడుతుంది. (ఈలోపు ఆడియన్స్ తెలుగులోనే మాట్లాడని కేకలు వేయగా). ఏంటీ.. తెలుగులోనే మాట్లాడాలా? చచ్చారు పోండి.. అయితే తెలుగులోనే మాట్లాడతాను. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ బెస్ట్ విషెష్’. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అంకుల్.. (తలవంచి నమస్కారం పెడుతూ..) ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మనోజ్ ఉండి ఉంటే.. కేవలం ఆయన గురించే మాట్లాడేవాడు. ఎందుకంటే ‘జంబలకిడిపంబ’ సినిమా వందసార్లు కాదు కదా.. 150, 1000 సార్లుకు పైగా ఆ క్యాసెట్ అరిగేదాకా స్కూల్ కాగానే ఆ సినిమానే చూసేవాళ్లం. దీంతో పాటు ‘ఏప్రిల్ 1 విడుదల’ ఇలా ఎన్నో మంచి సినిమాలతో అలరించారని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఈ మంచు లక్ష్మీ స్పీచ్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘జంబలకిడి పంబ’ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ అయితే.. నరేష్ ఎవరమ్మా.? మైక్ దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దు మంచు అక్కా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.