తెలంగాణలో మరిన్ని సంక్షేమ పథకాలు

పేద ప్రజల సంక్షేమంకోసం త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన కొనియాడారు.

తెలంగాణలో మరిన్ని సంక్షేమ పథకాలు
Follow us

|

Updated on: Sep 12, 2020 | 3:28 PM

పేద ప్రజల సంక్షేమంకోసం త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. పేద ప్రజలను ఆదుకునే ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన కొనియాడారు. అక్రమార్కుల చేతుల్లో సామాన్య ప్రజలు తమ భూములను కోల్పోకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిన వ్యక్తి కేసీఆర్ అని మల్లారెడ్డి అన్నారు. మేడ్చెల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో రూ.3 కోట్ల 60 లక్షలతో పలు అభివృద్ధి పనులకు మల్లారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అకాల మరణం చెందిన టీఆర్ఎస్ నేత చర్ల ఆంజనేయులు సంతాప సభలో పాల్గొన్న అనంతరం మల్లారెడ్డి.. కల్యాణలక్ష్మీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి, టీఆర్ఎస్ నేత మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.