ముస్లింల విషయంలో మీ సలహాలు మాకు అవసరం లేదు
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్పై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ సుందర్ ఫైర్ అయ్యారు. భారతదేశంలో ముస్లింలను ఎలా చూసుకోవాలో తమకు తెలుసని.. దీనికి మీ సలహా ఏం అవసరం లేదంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిస ఖుష్బూ.. ‘‘మా దేశంలో ముస్లింలను ఎలా చేసుకోవాలి అన్న విషయంపై మీ సలహాలు మాకు అవసరం లేదు. నేను పుట్టుకతో ముస్లింను.. అది నా నిర్ణయం కాదు.. కానీ భారతీయురాలిగా ఉండటం నేను చూసుకునే […]
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్పై సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్భూ సుందర్ ఫైర్ అయ్యారు. భారతదేశంలో ముస్లింలను ఎలా చూసుకోవాలో తమకు తెలుసని.. దీనికి మీ సలహా ఏం అవసరం లేదంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిస ఖుష్బూ.. ‘‘మా దేశంలో ముస్లింలను ఎలా చేసుకోవాలి అన్న విషయంపై మీ సలహాలు మాకు అవసరం లేదు. నేను పుట్టుకతో ముస్లింను.. అది నా నిర్ణయం కాదు.. కానీ భారతీయురాలిగా ఉండటం నేను చూసుకునే మొదటి ఎంపిక. ఎన్ని విబేధాలు ఉన్నా.. నేను మా ప్రధానిని గౌరవిస్తా. ఆయనకు మీ సలహా కచ్చితంగా అవసరం లేదు. ఎన్ని సమస్యలు వచ్చి.. మా భారతీయులం దాన్ని మాలోనే పరిష్కరించుకుంటాం. పాకిస్తాన్ మాకు సలహాలు ఇవ్వలేదు. ఇమ్రాన్ గారు మమ్మల్ని జాత్యాహంకారులు అనే ముందు మీ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోండి. మా ప్రధాని ఏం చేయాలి అన్న విషయాలు చెప్పడానికి మీకు ఎలాంటి హక్కు లేదు’’ అని ఖుష్బూ ఘాటుగా స్పందించారు. అయితే ఆర్టికల్ 370రద్దు తరువాత భారత్పై ఇమ్రాన్ విషంకక్కిన విషయం తెలిసిందే.
Mr @ImranKhanPTI we do not need your advise to tell us how to treat Muslims in my country..I am a Muslim by birth n that was not my decision but to be known as an Indian first is my choice..Despite ideological differences I respect my PM @PMOIndia ..He does not need you for sure.
— KhushbuSundar ❤️ (@khushsundar) August 6, 2019
Whatever the problems, we as INDIANS, shall solve it within us. Pak cannot advise us. @ImranKhanPTI pls solve the internal problems of your own country before you call us racists..you have absolutely no rights to tell our @PMOIndia what to do..
— KhushbuSundar ❤️ (@khushsundar) August 6, 2019