అనీల్ రావిపూడి మరో గుణశేఖరా?
13 ఏళ్ల తరువాత మహేష్ బాబు మరోసారి కర్నూలు బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తున్నాడు. అదే సరిలేరు నీకెవ్వరూ అనే మూవీ. కాశ్మీర్లో మిలిటరీ ఆఫీసర్గా పనిచేసే మేజర్ అజయ్ కృష్ణ సెలవుల్లో సొంత ఊరు కర్నూలుకి వస్తాడు. ఆ తరువాత జరిగేదే అసలు కథ. ఈ సినిమాకోసం హైదరాబాద్లోనే సెట్ వేస్తున్నారు. కొండారెడ్డి బురుజుని కూడా సెట్గా వేస్తున్నారు. 13 ఏళ్ల క్రితం మహేష్ బాబు కర్నూలుకి వెళ్లి షూటింగ్ చేశాడు. కానీ ఇపుడు ఆయన సూపర్ […]
13 ఏళ్ల తరువాత మహేష్ బాబు మరోసారి కర్నూలు బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తున్నాడు. అదే సరిలేరు నీకెవ్వరూ అనే మూవీ. కాశ్మీర్లో మిలిటరీ ఆఫీసర్గా పనిచేసే మేజర్ అజయ్ కృష్ణ సెలవుల్లో సొంత ఊరు కర్నూలుకి వస్తాడు. ఆ తరువాత జరిగేదే అసలు కథ. ఈ సినిమాకోసం హైదరాబాద్లోనే సెట్ వేస్తున్నారు. కొండారెడ్డి బురుజుని కూడా సెట్గా వేస్తున్నారు.
13 ఏళ్ల క్రితం మహేష్ బాబు కర్నూలుకి వెళ్లి షూటింగ్ చేశాడు. కానీ ఇపుడు ఆయన సూపర్ స్టార్ కదా. అందుకే కర్నూలునే హైదరాబాద్కి తెస్తున్నారు. ఇక్కడే సెట్ వేసి మహేష్ ఇబ్బంది పడకుండా చూస్తున్నారు ప్రొడ్యూసర్స్.
గ్రామాల్లోకి, చిన్న పట్టణాల్లోకి వెళ్లి పెద్ద హీరోలు సినిమాలు షూటింగ్ చేయాలంటే కష్టం. రోజుల తరబడి అక్కడే షూట్ చేయాలంటే చాలా సమస్యలు ఉంటాయి. జనాలను కంట్రోల్ చేయడం పెద్ద సమస్య. అందుకే ఇటీవల విడుదలైన మహర్షి సినిమాకి సంబంధించిన ఉరి సెట్ని కూడా ఫిల్మ్సిటీలో వేసి చిత్రీకరించారు.
ఒక్కడు కోసం చార్మినార్ సెట్ని, అర్జున్ సినిమాకోసం మధుర మీనాక్షి సెట్ని వేశారు. మహేష్ బాబు సినిమాల్లో సెట్స్ కామన్. సరిలేరు నీకెవ్వరుకి సంబంధించి కాశ్మీర్ పార్ట్ ఇప్పటికే ఫినిష్ అయింది. ఇక ఇప్పుడు కర్నూలు బ్యాక్డ్రాప్కి సంబంధించి హైదరాబాద్లో వేసిన సెట్లో తీస్తారు.