వీడిన విగ్రహ ధ్వంసం మిస్టరీ కేసు
కర్నూలుజిల్లాలో సంచలనం రేపిన కాలభైరవ స్వామి విగ్రహ ధ్వంసం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. కాలభైరవ దిగంబర విగ్రహానికి ఇంట్లోనే పూజలు చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకంతో ఓ వ్యక్తి ప్రతిమను ధ్వంసం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
KALABIRAVA CASE : కర్నూలుజిల్లాలో సంచలనం రేపిన కాలభైరవ స్వామి విగ్రహ ధ్వంసం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. కాలభైరవ దిగంబర విగ్రహానికి ఇంట్లోనే పూజలు చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకంతో ఓ వ్యక్తి ప్రతిమను ధ్వంసం చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
పాలకొండ మండలం చిన్నకందూరులో ఈ నెల 19 వ తేదీన గుర్తుతెలియని దుండగులు కాలభైరవ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయ్. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ ఫకీరప్ప …ప్రత్యేక బృందంతో లోతుగా విచారణ జరిపించారు.
గోస్పాడు మండలం వంట వెలగల గ్రామానికి చెందిన సత్తెనపల్లి రాజశేఖర్కి పదేళ్లయిన సంతానం కలగలేదు. ప్రతి అమావాస్య రోజున కాలభైవర స్వామికి ప్రత్యేక పూజలు చేసేవారు. ఐతే ఆలయంలో కాదు..ఇంట్లో పూజలు చేస్తే పిల్లలు పుడతారని ఎవరో చెప్పడంతో అర్థరాత్రి పూట దేవాలయానికి వెళ్లాడు. తాళాలు పగులగొట్టి కాలభైరవ స్వామి విగ్రహాన్ని పగులగొట్టి ఇంటికి తీసుకెళ్లి గుట్టుగా పూజలు చేసేవాడు. ఈ విషయం కొందరు స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు రాజశేఖర్ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అస్సలు విషయం బయటపడింది.
కాలభైరవ విగ్రహాన్ని ఎవ్వరూ కావాలని పగులగొట్టలేదని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. ఇందులో రాజకీయ ప్రమేయం లేదని… కేవలం మూఢనమ్మకాలే విగ్రహ ధ్వంసానికి కారణమైందని చెప్పారు.