ఈ నెల 4 నుంచి సికింద్రాబాద్లో కేటీఆర్ ప్రచార సభలు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సికింద్రాబాద్ లోక్సభ నియోజక వర్గ పరిధిలో ఈనెల 4 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజుల పాటు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించనున్నారు. ఆదివారం మంత్రి తలసాని.. కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రచార తేదీలను ఖరారు చేసినట్టు తెలిపారు. 4న అంబర్పేట, ముషీరాబాద్ సెగ్మెంట్లలోనూ, 5న సికింద్రాబాద్, సనత్నగర్లో, 6న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో రోడ్షోలు, ప్రధాన కూడళ్లలో కేటీఆర్ ఎన్నికల […]
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సికింద్రాబాద్ లోక్సభ నియోజక వర్గ పరిధిలో ఈనెల 4 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. మూడు రోజుల పాటు నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించనున్నారు. ఆదివారం మంత్రి తలసాని.. కేటీఆర్తో భేటీ అయ్యారు. ఈ మేరకు ప్రచార తేదీలను ఖరారు చేసినట్టు తెలిపారు. 4న అంబర్పేట, ముషీరాబాద్ సెగ్మెంట్లలోనూ, 5న సికింద్రాబాద్, సనత్నగర్లో, 6న జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి నియోజకవర్గాల్లో రోడ్షోలు, ప్రధాన కూడళ్లలో కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
రోడ్షోలన్నీ సాయంత్రం సమయాల్లోనే నిర్వహిస్తామని, ఏ ప్రాంతాల్లో ఏ సమయాల్లో ప్రచారం చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదని పార్టీ ముఖ్యనాయకుడొకరు తెలిపారు. అనంతరం 9వ తేదీ వరకు చేవెళ్ల, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు.