తెలంగాణనేకాదు, ఆంధ్రప్రదేశ్ ను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారు మోసంచేసింది: రియల్ ఎస్టేట్ సమ్మిట్లో కేటీఆర్
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను రెండింటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని..
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను రెండింటిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2020 లో పొల్గొని ప్రసంగించిన కేటీఆర్.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1వ తేదీన జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.