మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా సాగాలి : సభ్యత్వ నమోదుపై కేటీఆర్
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులుకు పిలుపునిచ్చారు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్లకు టెలీకాన్ఫరెన్స్లో పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించాలని ముఖ్యంగా యువకులు, విద్యావంతులపై ఫోకస్ పెట్టాలన్నారు. అర్బన్ ఏరియాల్లో ఉండే వృత్తి నిపుణులు, ఆయా కాలనీల్లో ఉండే ప్రతినిధులతో సమావేశమై పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించేలా చేయాలన్నారు కేటీఆర్. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా […]
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులుకు పిలుపునిచ్చారు ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్లకు టెలీకాన్ఫరెన్స్లో పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు. కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించాలని ముఖ్యంగా యువకులు, విద్యావంతులపై ఫోకస్ పెట్టాలన్నారు. అర్బన్ ఏరియాల్లో ఉండే వృత్తి నిపుణులు, ఆయా కాలనీల్లో ఉండే ప్రతినిధులతో సమావేశమై పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించేలా చేయాలన్నారు కేటీఆర్.
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదుకోసం ఇంటింటికీ వెళ్లి మాట్లాడటంతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉండే స్ధానిక కేబుల్ టీవీలను, సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా విస్తృతంగా ప్రచారాన్ని చేయాలన్నారు కేటీఆర్. అనుకున్న లక్ష్యం మేరకు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించి అత్యధిక కార్యకర్తలుగల పార్టీగా ఆవిర్భవించడానికి కృషిచేయాలని టెలీ కాన్ఫరెన్స్లో నేతలకు ఆయన విఙ్ఞప్తి చేశారు.