స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యత-మంత్రి కేటీఆర్
Give Priority to Domestic Manufacturers : స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని తెలిపారు. ఈ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్లో పాల్గొన్న మంత్రి.. పలు అంశాలపై వారితో చర్చించారు. […]
Give Priority to Domestic Manufacturers : స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని తెలిపారు. ఈ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్నివిధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్లో పాల్గొన్న మంత్రి.. పలు అంశాలపై వారితో చర్చించారు.
తెలంగాణలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణాలు ఇతరత్రా వంటి అంశాలను మంత్రి ఇందులో ప్రస్తావించారు. అన్ని రంగాలపై కోవిడ్ ప్రభావం పడిందన్న కేటీఆర్… ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టే యత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణలో ఆది నుంచి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. దేశంలోనే వలస కార్మికులను ఆతిథ్య కార్మికులను పేర్కొన్న ప్రభుత్వం తమదేనన్న మంత్రి కేటీఆర్… త్వరలోనే భవన నిర్మాణరంగం తిరిగి పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.