‘రంగమార్తాండ’ మళ్లీ సెట్స్ పైకి !
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా మొదలెట్టాడంటే చాలు..అమాంతం ఆ ప్రాజెక్ట్పై బజ్ పెరిగిపోతుంది. కృష్ణ వంశీ అంటేనే సమ్థింగ్ స్పెషల్.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ సినిమా మొదలెట్టాడంటే చాలు..అమాంతం ఆ ప్రాజెక్ట్పై బజ్ పెరిగిపోతుంది. కృష్ణ వంశీ అంటేనే సమ్థింగ్ స్పెషల్. అయితే గత కొన్ని ఏళ్లుగా ఆయనకు చెప్పుకోదగ్గ హిట్ లేదు. రామ్ చరణ్తో తీసిన ‘గోవిందుడు అందరివాడేలే’ సో..సోగా ఆడింది. ప్రస్తుతం కృష్ణవంశీ ‘నటసామ్రాట్’ అనే ఓ మరాఠి సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా మెజార్టీ పార్ట్ చిత్రీకరణ జరిగి… లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది. కాగా ప్రస్తుతం సడలింపులు ఉన్న నేపథ్యంలో వచ్చే వారం నుండి ‘రంగమార్తాండ’ షూటింగ్ ప్లాన్ చేస్తోనట్లు తెలుస్తోంది. ఈ తాజా షెడ్యూల్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పై కొన్ని కీలక సీన్స్ తీయబోతునట్లు సమాచారం. కృష్ణవంశీ దాదాపు 16 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఒక స్పెషల్ రోల్ కోసం అనసూయని తీసుకున్నారట. అను దేవదాసిగా నటిస్తోందని టాక్. మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బ్రహ్మనందం, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమర్తె శివాత్మిక నటిస్తున్నారు.
Also Read :
నైరుతి రుతుపవనాల తిరోగమనం, ఆంధ్రాలో ఈ ప్రాంతాలకు వర్షసూచన
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ