Krishnam Raju : ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన రెబల్ స్టార్ కృష్ణంరాజు
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అందాలతార పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది...
Krishnam Raju : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో అందాలతార పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ స్టోరీ గానే కాకుండా మంచి రొమాన్స్.. మంచి ఎమోషన్ మూవీగా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ తెలుపుతుంది. రాధేశ్యామ్’ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు వెయిట్ వేస్తున్నారు.
వింటేజ్ వండర్ గా ప్లాన్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా గురించి కృష్ణం రాజు ఇంట్రెస్టింగ్ విషయాన్నివెల్లడించారు. రాధేశ్యామ్ ను ఏప్రిల్ లో విడుదల చేయాలనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. మరో వైపు ఈ సినిమాలో కీలక పాత్రలో కృష్ణంరాజు నటిస్తున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. వీటిపై కూడా రెబల్ స్టార్ క్లారిటీ ఇచ్చారు. తాను సినిమాలో కీలక పాత్రను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ పాత్ర కోసం తాను గడ్డం కూడా పెంచానంటూ తెలిపారు. షూటింగ్ త్వరలో పూర్తి చేస్తాం. ప్రభాస్ మరియు నాకు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. పాటలు కూడా పూర్తి అయ్యాయి. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని కృష్ణం రాజు పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :